హైదరాబాద్ ​పర్యటనకు ప్రధాని..ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీఎస్, డీజీపీ

హైదరాబాద్ : ప్రధాని మోడీ హైదరాబాద్ ​పర్యటనకు రానున్న నేపథ్యంలో నగరంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్​ సోమేశ్ కుమార్​ ఆఫీసర్లను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ పరిసరాలను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. పీఎం టూర్​ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్‌‌‌‌ నియంత్రణ, బందోబస్తును బ్లూబుక్‌‌‌‌ ప్రకారం అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. వీవీఐపీ పర్యటన సమయంలో కరోనా ప్రొటోకాల్స్‌‌‌‌ పాటించేలా చూడాలని హెల్త్​సెక్రటరీని సీఎస్ ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే..

వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌‌‌‌కు ముందే ఆర్టీ పీసీఆర్​ కోవిడ్ టెస్టులు చేయాలన్నారు. పీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్​బీ అధికారులను​ ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్​పోర్ట్, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని, ఎక్కడా కూడా భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా ఉండకూడదని అధికారులను ఆదేశించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/