విశ్వనగరంగా హైదరాబాద్‌..మంత్రి కెటిఆర్‌

జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సర్కారు

ktr-introduces-bill-in-assembly

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ .. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ద్వారా మొత్తం 5 సవరణలు చేస్తున్నామని వివరించారు. 2015లోనే జీవో ద్వారా జీహెచ్ఎంసీలో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించామని అన్నారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత టిఆర్ఎస్ దేనని కెటిఆర్ తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగేందుకు దూసుకుపోతోందని ఆయన చెప్పారు. 1955లోనే హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడిందని కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా నిలపాలని గత ప్రభుత్వాలు ఎప్పుడూ భావించలేదని విమర్శించారు. రాష్ట్రంలో హరిత వనాలు పెంచేలా సిఎం కెసిఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5 శాతం పచ్చదనం పెరిగిందని ఆయన తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/