భారత్ పై ప్రశంశలు కురిపించిన ట్రంప్
ఎగుమతులపై నిషేదం ఎత్తివేసినందుకు ధన్యవాదాలు.
న్యూయార్క్: భారత్లో హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమయంలో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరమన్న ట్రంప్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా పోరాటంలో మీ బలమైన నాయకత్వానికి, మానవత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్రంప్ ట్వీట్లో పేర్కోన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/