రాజ్ ఘాట్… తన సందేశాన్ని రాసిన ట్రంప్‌

అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నానని వెల్లడి

trump
trump

న్యూఢిలీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. ఈసందర్భంగా ట్రంప్‌ దంపతులు ఢిల్లీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దర్శిస్తున్నారు. ఈ క్రమంలో మహాత్ముడి దివ్య సమాధి రాజ్ ఘాట్ ను సందర్శించి అక్కడి విజిటర్స్ బుక్ లో తన సందేశం రాశారు. ”సార్వభౌమ దేశం భారత్ తో అమెరికా ప్రజలు మరింత బలోపేతమైన బంధాలు కొనసాగిస్తారు. మహాత్మాగాంధీ మహోన్నత దార్శనికతను అమెరికా కూడా అనుసరిస్తుంది. ఇది మాకు దక్కిన అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నాను”అంటూ పేర్కొన్నారు.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/