ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం

జనవరి 15న అమెరికా, చైనా దేశాల ఉన్నతాధికారులు సంతకం

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా, చైనా దేశాల మధ్య గతేడాదిగా కొనసాగుతున్న వాణిజ్య యుద్దానికి తెరపడనుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన తొలి ఒప్పందంపై జనవరి 15న ఇరు దేశాల ఉన్నతాధికారులు సంతకం చేయనున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. వైట్‌హౌజ్‌ వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమానికి ఇరు దేశాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ ఒప్పందం కుదిరిన తర్వాత బీజింగ్‌కు వెళ్లి ఆ దేశంతో మరోదఫా చర్చలు జరుపనున్నట్లు ఆయన వెల్లడించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/