ట్రంప్‌ వ్యాఖ్యలపై పలువురు నిపుణులు అసహనం

donald trump
donald trump

వాషింగ్టన్‌: ట్రంప్ అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారాన్ని తిరిగి మొదలుపెట్టారు. శనివారం ఓక్లహామాలోని టల్సా నగరంలో ఉన్న బీఓకే సెంటర్‌లో ట్రంప్ ఇండోర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ‘అమెరికాలో 2.5 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. అన్ని పరీక్షలు నిర్వహించారు కాబట్టే కరోనా కేసులు కూడా ఆ స్థాయిలో బయటపడుతున్నాయి. కాబట్టి అమెరికాలో కరోనా పరీక్షల సంఖ్యను తగ్గించాలని అధికారులకు సూచించాను’ అని ట్రంప్ అన్నారు. అంతే.. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని పలువురు నిపుణులు, ట్రంప్ స్వంత సిబ్బంది సైతం ఈ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/