ట్రూజెట్ కి తృటిలో తప్పిన ప్రమాదం
kadapa: కడప నుంచి విజయవాడకు వెళుతున్న ట్రూజెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన వెంటనే పక్షి అడ్డురావడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సేఫ్గా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఎయిర్పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/