మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్దే విజయం
ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయం
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హుజూర్ నగర్లో మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయమని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బిజెపి నేతలు కనపడతారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్ల ఎన్నిక తర్వాతే మున్సిపల్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని ఈటల రాజేందర్ తెలిపారు. అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడంలో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు టిఆర్ఎస్కు మాత్రమే ఉందని, తాము ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పుకొచ్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/