మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ప్రాణహాని ఉందని తెరాస నేత పిర్యాదు

రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ప్రాణహాని ఉందని తెరాస పార్టీకి చెందిన మహబూబ్ నగర్, రాంనగర్ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు. సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

పట్టణంలో అక్రమ కట్టడాల విషయమై మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కి, సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేశానని మంత్రి తనపై కక్ష గట్టారని ఆయన ఆరోపించారు. తనపై పగ తీర్చుకునేందుకు పోలీసులతో కుమ్మక్కై నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయాడు. మంత్రి తనను హత్య చేయించాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పందించి తనకు రక్షణ కల్పించాలని.. అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.