వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న టిఆర్ఎస్
పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎస్ ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లులు చట్టరూపం దాల్చనున్నాయి. అయినప్పటికీ, ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లుపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విభిన్న వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ బిల్లులకు వైఎస్ఆర్సిపి పూర్తి మద్దతు ప్రకటించగా… టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని టిఆర్ఎస్ వాదిస్తోంది.
ఈ క్రమంలో ఈ బిల్లులను వ్వతిరేకిస్తూ టిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఈరోజు ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఇతర విపక్ష సభ్యులతో కలిసి టిఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ నిరసన వ్యక్తం చేయడం మనం ఫొటోలో చూడవచ్చు. మరోవైపు, ఈ బిల్లుల వల్ల రైతులకు ఇప్పటి వరకు జరగని మేలు జరగబోతోందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/