తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

తెరాస అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తుక్కెళ్ల పల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, , పాడి కౌశిక్ రెడ్డి పేర్లను ప్రకటించారు.ఈటల సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు మంత్రి పదవి దక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జాబితాలో ఆకుల లలిత కొనసాగింపుతో పాటు మధుసూధనాచారికి అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు రాగా.. చివరి నిమిషంలో అంతా తారుమారైంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సిద్దిపేట కలెక్టర్‌ గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంకట్రామిరెడ్డిని పెద్దల సభకు పంపిచాలని తెరాస నిర్ణయించింది.

మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆదిలాబాద్, వరంగల్, మెదక్ నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం లో ఉన్న ఒక్కొక్క సిటు,మహబూబ్ నగర్,రంగారెడ్డి జిల్లా రెండు స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. నవంబర్ 23 నామినేషన్ల స్వీకరణకు చివరితేదీగా నిర్ణయించారు. నవంబర్ 24 నామినేషన్ల పరిశీలన జరగనుంది.నవంబర్ 26 ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్ 10 పోలింగ్. డిసెంబర్ 14 కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.