ఈడీ ఆఫీస్ లో అస్వస్థతకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ

TRS MLC L Ramana

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ఆఫీస్ లో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయన్ను హాస్పటల్ కు తరలించారు. కేసినో కేసులో ఎల్.రమణ ను ఈరోజు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కొద్దీ సేపటి క్రితమే ఈడీ ఆఫీస్ కు చేరుకున్న ఆయన..వచ్చిన కాసేపట్లోనే అస్వస్ధతకు గురయ్యారు.

నేపాల్ లో చికోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినో ఈవెంట్లకు సంబంధించి రమణను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. జూన్ లో బిగ్ డాడీ పేరుతో నేపాల్ లో నిర్వహించిన ఈవెంట్ పై ప్రశ్నిస్తున్నారు. మే నెలలో కొన్ని ప్రాంతాల్లో…. జూన్ లో గోవా, నేపాల్ లో చికోటి ప్రవీణ్ పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్ కు పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు హాజరయ్యారని తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులతో పాటు వైసీపీ నేత గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు.