కోరిక తీర్చలేదని మహిళ గొంతు కోసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దారుణం జరిగింది. కోరిక తీర్చలేదని ఏకంగా మహిళా గొంతు కోశాడు ఓ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కు పీఏ కావడంతో రాజకీయంగా ఇది చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళ్తే..

అధికారపార్టీ టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పీఏ విజయసింహా ఆదివారం అర్ధరాత్రి సమయంలో వెంటాడి మరీ తన భార్య నిషా (35) గొంతు కోసి హత్యాయత్నం చేయబోయాడంటూ బాధితురాలి భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయసింహా తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని, గతంలో ఈ విషయమై తన భార్య చెప్పిందని.. కాల్ రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నట్లు నిషా భర్త తెలిపాడు.

గత కొద్దీ రోజులుగా నిషా ను..విజయసింహా బెదిరిస్తున్నాడట. భర్తను వదిలేసి తనతో ఉండాలంటూ.. ఫేస్ బుక్ లో పరిచయం ఐన ఎమ్మెల్యే పిఏ విజయ్ సింహ..ఆ మహిళను బెదిరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి నిషా ఇంటికి వెళ్లిన విజయసింహ..ఆమెను బలవంతం చేసేందుకు ట్రై చేసాడు. ఆమె నిరాకరించడంతో బీర్ బాటిల్ పగలగొట్టి గొంతు కోశాడు. దీంతో మహిళ గొంతుకు తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడితో ఆగకుండా.. ఆమె చేయిని విరిచేసి, పిడుగుద్దులు గుద్దాడు విజయసింహ. ఈ విషయాన్ని వీడియో కాల్ చేసి భర్తకు చెప్పింది మహిళ. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.