బిజెపి తీరు పట్ల టిఆర్ఎస్ నేతల నిరసన

అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలను కొనుగోలు చేసేందుకు బిజెపి ట్రై చేయగా..వారి ప్లాన్ రివర్స్ అయ్యింది. నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన కొనుగోలు వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేసారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం పట్ల టిఆర్ఎస్ నేతలు బుధువారం రాత్రి బిజెపి తీరు ఫై నిరసన వ్యక్తం చేసారు.

చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై మంత్రుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. నికార్సైన తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేసిన బీజేపీ దుష్ట చర్యలు, దుర్మార్గాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నేతలు రాజ్యాంగం పట్ల అవహేళనగా ప్రవర్తిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.