దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని కేసీఆర్​ కు బండి సంజయ్ సవాల్​

దమ్ముంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని కేసీఆర్​ కు సవాల్​ విసిరారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..కేసీఆర్ ఫై , టిఆర్ఎస్ పార్టీ ఫై విమర్శలు చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎటెటో పోతున్నరట.. రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్​ లో ఉంది. దాన్ని కాపాడుకోవడంపై కేసీఆర్​ దృష్టిపెడితే మంచిది అని సంజయ్ అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను అగౌరవపరిచేలా సీఎం కేసీఆర్​ నడుచుకుంటున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.

‘‘యశ్వంత్​ సిన్హా గెలిచేది లేదు.. ఏం లేదు.. ర్యాలీలతో ఆర్భాటం చేయడం అవసరమా? అదేమైనా గ్రామ సర్పంచ్​ ఎన్నిక అనుకున్నవా కేసీఆర్​ ?” అని వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్​ రద్దు, ట్రిపుల్​ తలాక్​, అయోధ్య రామమందిర నిర్మాణం, పేదలకు ఇళ్లు, అన్నయోజన బియ్యం పంపిణీ, స్వచ్ఛ భారత్​, గ్రామీణ సడక్​యోజన వంటి పథకాలన్నీ మోడీ వల్లే జరిగాయని సంజయ్​ గుర్తుచేశారు. పంజాబ్​ పోయి రైతులకు రూ.3 లక్షలు ఇచ్చిన కేసీఆర్​.. తెలంగాణ రైతులకు ఎందుకు సాయం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతుల చేతులకు బేడీలు వేసిన రైతు ద్రోహి కేసీఆర్​ అని కామెంట్​ చేశారు. దమ్ముంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టి చూపించాలని కేసీఆర్​ కు సవాల్​ విసిరారు.