కరోనా కష్టకాలంలో ఒకరికి ఒకరం సాయపడాలి

టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్న..మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Former MLA kasu kutta Prabhakar Reddy

యాదాద్రి: మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదల సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఆపత్కాలంలో పేదలను అక్కున చేర్చుకుంటున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఒకరికి ఒకరం సాయపడుతూ అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెస్ రెడ్డి రాజు ,సింగిల్ విండో చైర్మన్ చింతల్ దామోదర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/