త్రిపుర సీఎం బిప్ల‌వ్ దేవ్‌పై హ‌త్యాయ‌త్నం

అగ‌ర్తాలా: త్రిపుర సీఎం బిప్ల‌వ్ దేవ్‌పై హ‌త్యాయ‌త్నం జరిగింది. గురువారం సాయంత్రం అగ‌ర్తాలాలోని శ్యామ్‌ప్ర‌సాద్ ముఖ‌ర్జీ లేన్‌లోని త‌న అధికారిక నివాసం వ‌ద్ద బిప్ల‌వ్ కుమార్ ఈవినింగ్ వాక్ చేస్తుండ‌గా.. గుర్తు తెలియ‌ని ముగ్గురు దుండ‌గులు కారులో వ‌చ్చి సీఎంను ఢీకొట్టేందుకు య‌త్నించారు.

అప్ర‌మ‌త్త‌మైన సీఎం ఆ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప‌క్క‌కు జంప్ చేశారు. సీఎం సెక్యూరిటీలో ఒక‌రికి స్వల్ప గాయాల‌య్యాయి. ఆ దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది య‌త్నించారు. అదే రోజు రాత్రి ఆ ముగ్గురిని కీర్చోముహ‌ని ఏరియాలో అదుపులోకి తీసుకుని వాహ‌నాన్ని సీజ్ చేశారు. ఈ ముగ్గురిని శుక్ర‌వారం రోజు కోర్టులో హాజ‌రు ప‌రిచారు. అనంత‌రం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/