ఢిల్లీ ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయం

రాపిడో, అభీబస్‌ డాట్‌కాం ఉచిత సేవలు

delhi-voters
delhi-voters

న్యూఢిల్లీ :ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసారి భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఈరోజు పోలింగ్‌ సందర్భంగా పలు సంస్థలు ఓటర్లకు ఉచిత రవాణా సదుపాయం ఆఫర్‌ చేయడం విశేషం. ఇందులో ఆటోలు, బైక్‌లే కాదు స్పైస్‌ జెట్‌ విమానయాన సంస్థ కూడా ఉచిత సర్వీస్‌ అందిస్తానంది. బైక్-టాక్సీ బుకింగ్ యాప్ ‘రాపిడో’ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ ఓటర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ ఫ్రీ రైడింగ్ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ‘అభీ బస్ డాట్ కామ్’ కూడా ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదంతో ఉచిత బస్సు సేవలకు ముందుకు వచ్చింది. ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్‌ జెట్‌ ఈరోజు ఢిల్లీ వచ్చేవారు, తిరిగి ఇదే రోజు వెళ్లిపోతే రానుపోను టిక్కెట్లపై బేస్ చార్జీని వాపసు ఇవ్వనున్నట్లు తెలిపింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/