తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల కమిషనర్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కరీంనగర్ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న బోనగిరి శ్రీనివాస్ను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. తాండూరు మున్సిపల్ కమిషనర్ గా శ్రీనివాస్ రెడ్డి బదిలీపై వెళ్లనున్నారు. ఇప్పటి వరకు ఈయన నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. జహీరాబాద్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న విక్రం సింహారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన కొల్లాపూర్ మున్సిపాల్ కమిషనర్గా బదిలీపై వెళ్లనున్నారు.
అయితే ప్రస్తుతం కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న వెంకటయ్య.. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ మున్సిపాలిటీకి కమిషనర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం దేవరకొండ కమిషనర్గా పనిచేస్తున్న పూర్ణచందర్రావు.. యాదాద్రి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీకి కమిషనర్గా బదిలీపై రానున్నారు. జనగామ జిల్లా కేంద్రం మున్సిపల్ కమిషనర్గా ఉన్న రవీందర్ ను మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. దీంతో ఖాళీ అవుతున్న జనగామ మునిపాల్ కమిషనర్ స్థానంలో ఎస్. సమ్మయ్య నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ కమిషనర్గా గోపయ్యను ప్రభుత్వం నియమించింది. కోదాడ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా చేస్తున్న దండు శ్రీనివాస్కు పదోన్నతి లభించింది. ఆయనను తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. ఇది ఇలా ఉంటే నార్సింగ్ మున్సిపాలిటీ కమిషనర్గా సత్యబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/