గ్రీన్‌లో ఘోర రైలు ప్రమాదం…26 మంది మృతి

గ్రీస్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్​ ట్రైన్​ ఎదురుగా వస్తున్న మరో గూడ్స్​ రైలును ఢీ కొట్టింది. దీంతో రెండు రైళ్లలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘోర ప్రమాదంలో 26 మంది మృతి చెందగా..85 మందికిపైగా గాయపడ్డారు. థెస్స – లారిస్సా నగరాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలా బోగీలు పట్టాలు తప్పగా.. మరో బోగీలకు మంటలు అంటుకున్నాయి.

ప్యాసింజర్‌ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు చెపుతున్నారు. ఇప్పటివరకు 16 మంది మృతదేహాలను వెలికి తీయగా, 85 మందికి పైగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఏథెన్స్​కు 380 కిలోమీటర్లు దూరంలో ఉన్న టెంపే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.