నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నేడు నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్టుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10.15 నిమిషాల ప్రాంతంలో జూబ్లీహిల్స్లోని ఉపరాష్ట్రపతి ఇంటి నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పంజాగుట్ట ఫ్లైఓవర్ రూట్లలో ట్రాఫిక్ నిలిపివేయడంతోపాటు వాహనాలను దారిమళ్లించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిర్ణీత సమయంలో ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని నగర ట్రాఫిక్ అధికారులు సూచించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/