దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్

నర్సారెడ్డి పేరును ఖరారు చేసిన టీపీసీసీ

congress party
congress

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో టీకాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ఖారారు. చేసింది. సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును ఖరారు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా నేతల సూచన మేరకు టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నర్సారెడ్డి పేరును పార్టీ హైకమాండ్ కు పంపించింది. అధిష్ఠానం ఆమోదం తెలిపిన వెంటనే నర్సారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. 10వ తేదీన కౌంటింగ్ జరగనుంది. మరోవైపు రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. బిజెపి తరపున రఘునందన్ రావు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/