కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ విమర్శలు

కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉద్యోగాలు కావాలన్న ఉద్యమ ఆకాంక్షకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఉత్తరాది వారినే ఎక్కువగా నియమించారని, తెలంగాణ వారిపట్ల వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ భవన్ ముందు నిన్న విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. దానిపై స్పందిస్తూ రేవంత్ ట్వీట్ చేశారు.

‘‘మన ఉద్యోగాలు మనకు కావాలన్న ఉద్యమ ఆకాంక్షలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేసీఆర్ పాలనలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్యాయం ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న వివక్షే అందుకు నిదర్శనం. ఈ ఆందోళనలన్నీ తుది దశ ఉద్యమానికి సంకేతాలు. సిద్ధంగా ఉండు కేసీఆర్’’ అంటూ ఆయన హెచ్చరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/