పేర్ని నాని కలిసిన నిర్మాతలే…ఇప్పుడు పవన్ ను కలిశారు..అసలేం జరుగుతుంది

మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేసిన మంత్రి పేర్ని నాని ని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు..ఈరోజు ఉదయం మళ్లీ పవన్ కళ్యాణ్ ను కలవడం చర్చ గా మారింది. అసలు ఏంజరుగుతుందని సినీ ప్రముఖులు , అభిమానులు మాట్లాడుకుంటున్నారు. వారం రోజుల క్రితం రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యల ఫై వైసీపీ నేతలు సైతం అదే రేంజ్ లో మండిపడ్డారు. ఇప్పటికే పవన్ ఫై మాటల యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మంత్రి పేర్ని నాని ని టాలీవుడ్ నిర్మాతలైన దిల్ రాజు , మైత్రి నిర్మాతలు , డివివి దానయ్య , బన్నీ వాసు మొదలగు వారు కలిసి చిత్రసీమ సమస్యలు , పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఫై మంత్రి తో మాట్లాడడం జరిగింది. ఆ క్షణం కూడా మంత్రి నాని , పవన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

నిర్మాతలు మంత్రి ని కలవడం , పవన్ వ్యాఖ్యల ను చిత్రసీమ తప్పు పట్టడం అభిమానులు , మెగా హీరోలు తట్టుకోలేకపోయారు. ఇండస్ట్రీ తరుపున మాట్లాడిన పవన్ ను వ్యతిరేకిస్తారా అని కామెంట్స్ చేసారు. ఆ రోజు మంత్రిని కలిసిన నిర్మాతలే ఈరోజు మళ్లీ పవన్ కళ్యాణ్ ను కలవడం వెనుక రహస్యం ఏంటి అనేది అర్ధం కావడం లేదు. పవన్ ను దూరం చేసుకోవడం ఇష్టం లేకనే మళ్లీ ఆయన్ను కలిసారా..లేక మంత్రి తో ఏమాట్లాడారనేది చెప్పడానికే కలిసారా అనేది తెలియాల్సి ఉంది. ఏదై ఏమైనప్పటికి ఇండస్ట్రీ లో ఏంజరుగుతుందనేది అర్ధం కానీ పరిస్థితి నెలకొని ఉంది.