నేడు మహబూబ్‌నగర్‌కు సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. రాష్ట్ర ఎైక్సెజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి నారాయణగౌడ్‌ దశదిన కర్మ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకొంటారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు ముఖ్యనేతలు కూడా మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు. ఆదివారం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు సిఎం కెసిఆర్‌ వెళ్లే అవకాశం ఉన్నది. ఈ కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/