రేపు ‘విరూపాక్ష‌’ టైటిల్ గ్లింప్స్ రాబోతుంది

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మూవీ విరూపాక్ష‌. తన 15 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ని కార్తీక్ వర్మ డైరెక్ట్ చేస్తుండగా..కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా పూజా కార్య క్రమాలను పూర్తి చేసుకొని , సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ నుండి రేపు టైటిల్ గ్లింప్స్ రాబోతుంది. ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ ను రేపు ఉదయం 10:30AM గంటలకు రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ మూవీ లో తేజు కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తుంది.

గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఇంటికే పరితమైన ఈ యంగ్ హీరో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తన 15 వ మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమయ్యాడు. ఆ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తుండగా… ఆయన శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌ వీడియో కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో లో ” అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు. అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది.

విజువల్స్ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరోసారి తన టాలెంట్ ని అజనీష్ నిరూపించుకునేలా ఉన్నారు. ఇక పోతే ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల కానుంది.