టైమ్స్ గ్రూప్ ఛైర్ పర్సన్ ఇందూ జైన్ (84) కరోనాతో మృతి
ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖులు సంతాపం
దేశంలో ప్రసిద్ధ మీడియా సంస్థ టైమ్స్ గ్రూప్ ఛైర్ పర్సన్ ఇందూ జైన్ (84) కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా పాజిటివ్ రాగా, ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. 1936 సెప్టెంబర్ 8న ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్లో ఇందూ జైన్ జన్మించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అశోక్ కుమార్ జైన్ తో ఆమె వివాహం జరిగింది.
1999లో భర్త అశోక్ కుమార్ జైన్ గుండె సంబంధిత సమస్యలతో మృతి చెందారు. అనంతరం టైమ్స్ గ్రూప్ బాధ్యతలను ఇందూ జైన్ చేపట్టారు. పారిశ్రామిక రంగానికి ఇందూ జైన్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మవిభూషణ్’ పురస్కారంతో సత్కరించింది. 2015లో 3.1 బిలియన్ డాలర్ల సంపదతో ఇందూ జైన్ ఫోర్స్బ్ ర్యాంకింగ్స్ లో స్థానంలో నిలిచారు భారత్ లోని కుబేరుల్లో 57వ స్థానం, ప్రపంచంలో 549వ స్థానంలో ఉన్నారు. ఇందూ జైన్ మృతి పట్ల ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/