విమానంలో చెలరేగిన మంటలు..113 మంది ప్రయాణికులు సురక్షితం
చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్ పోర్టులో విమాన ప్రమాదం
బీజింగ్: చైనాలోని చాంగ్ కింగ్ ఎయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ కు విమానం సిద్ధమైన సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది… ప్రయాణికులను, విమాన సిబ్బందిని అత్యవసర మార్గాల ద్వారా కిందకు దించారు. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి.
కాగా, గురువారం ఉదయం 8 గంటల సమయంలో చాంగ్కింగ్ ఎర్పోర్టులో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే ల్యాండ్ చేశారు. అయితే ల్యాండింగ్ అవుతుండగా అది రన్వేదాటి వెళ్లిపోయింది. ఈ క్రమంలో విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది.. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని అత్యవసర ద్వారం నుంచి కిందికి దించివేశారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు. రన్వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటివరకు విమాన రాకపోకలను నిలిపివేశారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/