ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదల హతం

terrorists killed in encounter in Jammu and Kashmir
terrorists killed in encounter

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఓ జ‌వాన్ అమ‌రుడ‌య్యాడు. జిల్లాలోని జ‌డూరా ప్రాంతంలో శ‌నివారం తెల్ల‌వారుజామున 1 గంట‌ల‌కు ఎన్‌కౌంట‌ర్ ప్రారంభ‌మైంద‌ని ఆర్మీ ప్ర‌తినిధి క‌ల్న‌ల్ రాజేష్ క‌లియా తెలిపారు. భ‌ద్ర‌తా ద‌ళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌వ‌గా, ఓ జ‌వాన్ తీవ్ర‌గా గాయ‌ప‌డ్డాడ‌ని, ద‌‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే జ‌వాన్ మ‌‌‌ర‌ణించాడ‌ని వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదుల కోసం గాలింపు కొన‌సాగుతున్న‌ద‌ని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం షోపియాన్ జిల్లాలో జ‌రిగిన ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుపెట్టాయి. దీంతో క‌శ్మీర్ లోయ‌లో గ‌త 24 గంట‌ల్లో ఆరుగురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/