దుండగుల కాల్పులు..ముగ్గురు మహిళా జర్నలిస్టులు మృతి

జలాలాబాద్‌: ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం ఉదయం రెండు వేర్వేరు కాల్పుల సంఘటనల్లో ముగ్గురు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. వీరు ముగ్గురు కూడా స్థానిక ఎనికాస్‌ రేడియో, టీవీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం జలాలాబాద్‌లో నివసిస్తున్న సాదియా, షెహనాజ్‌లు ఇంటికి సమీపంలో వాకింగ్‌ చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. దాంతో వీరిద్దరు అక్కడికక్కడే చనిపోయారు. కాగా, మరో ప్రాంతంలో ముర్సాల్‌ హబీబీ అనే ఉద్యోగిపై కూడా కాల్పులు జరిపారు. ఆమె కూడా స్పాట్‌లోనే చనిపోయింది. వీరు ముగ్గురు గత కొంతకాలంగా భారతదేశానికి చెందిన పలు డ్రామాలు, సీరియళ్లను స్థానిక భాషల్లోకి డబ్బింగ్‌ చేసే పనిలో నిమగ్నమై ఉన్నరని ఎనికాస్‌ టీవీ డైరెక్టర్‌ జలమాయ్‌ లతీఫ్‌ చెప్పారు.

తాజా జాతీయ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/