తాలిబన్ల దాడి ముగ్గురు సైనికుల దుర్మరణం
కాబూల్: తాలిబన్ ఉగ్రవాదులు ఆప్ఘనిస్తాన్లో శుక్రవారం జరిపిన వేర్వేరు దాడుల్లో ముగ్గురు ఆప్ఘన్ సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. హెల్మాండ్ ప్రావిన్స్లోని హెల్మాండ్ జాతీయ రహదారితోపాటు నహ్రీ సరాజ్ జిల్లాలో ఈ దాడులు జరిగినట్లు హెల్మాండ్ గవర్నర్ అధికార ప్రతినిధి ఒమర్ జ్వాక్ తెలిపారు. దాడులకు కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. అంతర్ఆఫ్ఘన్ చర్చలను ప్రారంభించేలా ఖైదీల మార్పిడికి అష్రఫ్ ఘని ప్రభుత్వం తాలిబన్లతో శాంతిచర్చలు జరుగుతున్నా దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
తాజా ఎడిటోరియల్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/editorial/