ప్రారంభమై శ్రీవారి లడ్డూ అమ్మకాలు

55 రోజులుగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనం

tirumala laddu
tirumala laddu

తిరుమల: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల 55 రోజుల పాటు విక్రయాలు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలను మళ్లీ భక్తులు పొందే అవకాశం లభించింది. లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఈ రోజు వాటి కోసం భారీగా తరలిరావడం గమనార్హం. కాగా శ్రీవారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/