ఏపిలో రేపు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు

అమరావతి: ఏపిలో రేపు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 579 ఏక గ్రీవాలు కాగా… ఫిబ్రవరి 17న 2640 సర్పంచ్.. 19,607 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నాలుగవ విడత నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. 3 గంటల తరవాత అభ్యర్థుల తుది జాబితాను ఎస్‌ఈసీ ప్రకటించనుంది. ఫిబ్రవరి 21న పోలింగ్ నిర్వహించున్నారు.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/