ఏపిలో కొనసాగుతున్న మూడో దశ పోలింగ్

ఓటు హక్కును వినియోగించుకోనున్న 55,75,004 మంది

అమరావతి: ఏపిలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం ఆరున్నర గంటలకు పోలింగ్ మొదలుకాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మద్యాహ్నం 1.30 వరకు పోలింగ్ జరుగుతుంది.

ఈ దశలో మొత్తం 3,221 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 579 ఏకగ్రీవమయ్యాయి. విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని మూడు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్, 19,553 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ విడతలో మొత్తం 55,75,004 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/