కళ్లలో నిప్పులు పోసుకోకు చంద్రబాబు

సంక్షేమ పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చే దేశంలో ఎక్కడా లేదు

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిపై వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. సంక్షేమ పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చే పద్దతి దేశంలో ఎక్కడా లేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఇచ్చినా బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్‌ ఆదేశాలతో ఒకటో తేదీన వలంటీర్ల పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్నారని తెలిపారు. ఇంకా చాలా చూడాలి చంద్రబాబు నాయుడు కళ్లలో నిప్పులు పోసుకోకు అని ఎద్దేవా చేశారు. ఇంకా మరో ట్వీట్‌లో రాజధాని విషయంలో ఎల్లో మీడియా ఎంత రెచ్చగొట్టినా ప్రజల నుంచి కనీస స్పందన లేదని అన్నారు. అమరావతి కృత్రిమ ఉద్యమాల వెనక ఉన్న అసలు కారణం అందరికీ అర్థమయిందని చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. ఇంకా లాభం లేదని చంద్రబాబు నాయుడు జోలె వదిలేసి కౌన్సిల్‌ పరిరక్షణ పోరాటం మొదలు పెట్టాడని, ఢిల్లీలో ఎవరి కాళ్లు పట్టుకోవాలో ప్రాక్టీస్‌ చేస్తున్నాడని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/