దేశంలో ప్రగతి కనిపించడంలేదు

మోడి ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా మారింది

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం ఏర్పాటు చేసిన సదస్సులో చిదంబరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మోడి ప్రభుత్వం పేదలకు వ్యతిరేకంగా మారిందని ఆయన అన్నారు. మోడి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందంటూ.. దేశంలో ఏ రంగంలోనూ ప్రగతి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మోడి ప్రభుత్వం అచ్చేదిన్ అంటూ ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. దేశంలోకి పెట్టుబడులు రావడం లేదన్నారు. విదేశీ నిల్వలు కూడా పడిపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు స్పందించడం లేదని చిదంబరం ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చారిత్రక తప్పిదాలని వ్యాఖ్యానించారు. ఈ చర్యవల్ల పారిశ్రామిక ప్రగతి చతికిలపడిందని చెప్పారు.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/