బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు

జగన్‌ మాదిరిగా తాను ఏ తప్పు చేయలేదు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేసినా సిట్‌పై చంద్రబాబు నాయుడు స్పందించారు. జగన్‌ మాదిరిగా తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని, గత ఏడు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని మండిపడ్డారు. జగన్‌మోహన్‌ రెడ్డి తప్పులు చేసి ఇరుక్కుపోయారని, రాత్రుళ్లు నిద్ర లేని పరిస్థితి వస్తుందని అన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ఏమన్నా చేసుకోవచ్చని, దిక్కున్నచోట చెప్పుకోమన్నానని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై ఇంటిలిజెన్స్‌ డీఐజీ నేతృత్వంలో జగన్‌ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. టిడిపి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలపై సిట్‌ విచారణ జరపనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/