పల్లెలను పునరుజ్జీవింప చేయాలి

VIllage
VIllage

సౌంకేతిక విప్లవం కార ణంగా ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిన తరుణంలో పల్లెలన్నీ నగరీకరణ, ప్రపంచీకరణ పేరుతో కట్టలు తెంచు కుని పరుగులు పెడుతున్న నేపథ్యం లో మానవ్ఞల మధ్య సంబంధాలు కూడా అంతే వేగంతో దిగజారిపో తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించి, స్వేచ్ఛ పేరుతో, ప్రైవసీ పేరుతో న్యూక్లియర్‌ కుటుంబాలుగా అవతరిస్తున్నాయి. పల్లెలన్నీ నాగరికత పేరుతో నగర వాతావరణాన్ని సంతరించుకుంటున్నాయి.

ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే పల్లె వాతావరణం గతకాలపు వైభవంగా చరిత్రలో కలిసిపోయింది. పల్లె జనం తమ అస్థిత్వాన్ని విడనాడి, నగరాలవైపు వలసపోతున్నది. గ్రామాలంటే కంటగింపుగా మారాయి. కృత్రిమ వాతావరణంలో, కాంక్రీటు అరణ్యాలలో అధునాతన కట్టడాలలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న నేటిపోకడలను చూస్తుంటే భయమేస్తుంది. జనసంద్రంలా మారిన నగర వాతావరణంలో ఇమడలేని జనం కూడా ఒకప్పటి పల్లె వాతావరణాన్ని గుర్తు చేసుకునేలా శుభకార్యాలు, పర్వదినాల పేరుతోనో, మార్నింగ్‌ వాకింగ్ల పేరుతోనో, పార్కుల్లో నలుగురితో కలిసిపోయి ఆత్మీయంగా పలకరించుకుంటూ,చక్కని సంబంధాలను నెలకొల్పుకుంటున్నారు.

విదేశాల్లో ఉండే భారతీయులు కూడా అలనాటి భారతీయ సంస్కృతిని, కలుపుగోలుతనాన్ని గుర్తు చేసు కుంటూ తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం గమనార్హం. మరి పల్లెల్లోనూ నాగరికత మోజుతో విలువలను విధ్వంసం చేసుకుంటున్నాయి. పల్లెలను వీడి, పల్లెల్లో పనిచేయడం మాని, నగరాలవైపు పరుగుతీయడం బాధాకరం. దేశంలో జనాభా పెరు గుతున్నది. పెరిగిన జనాభాతోపాటుగా పోటాపోటీగా అవసరాలు కూడా పెరుగుతున్నాయి.

అవసరాలకు తగ్గట్టుగా వనరుల కల్పన కూడా కష్టతరమవ్ఞతున్నది. విద్యావకాశాలు మెరుగుపడ్డాయి. కాని చదువ్ఞకున్న యువతకు చదువ్ఞకు తగ్గరీతిలో ఉపాధి అవకాశాలు కలగడం లేదు. నిరుద్యోగ యువత ఉద్యోగవేటలో పడి, నగరాల్లో తిరుగుతూ, నరకయాతన అనుభవిస్తున్నది. మురికివాడలు పెరిగి పోయాయి. చాలిచాలని సంపాదనతో రేయింబవళ్లు, శ్రమచేస్తూ భారమైన బతుకులతో బయటకు చెప్పుకోలేని బాధలను అనుభవి స్తున్నారు. హాయిగా ఉండే పల్లెల్లో పనులు చేయడం నామోషిగా భావించడం వలనే ఇలాంటి అస్తవ్యస్థ పరిస్థితులు దాపురిస్తున్నా యి. ఇంటిపని, వంటపనిచేయడం అవమానంగా భావించే యువత తయారైంది.

చదువ్ఞలంటే సంస్కారానికి కాకుండా విలాసాలకు, అలంకారాలకు నిలయంగా భ్రమించే యువత తయారైంది. నిజం చెప్పాలంటే విద్యావంతులకు ఒకప్పుడుచాలా గౌరవం ఉండేది. కారణం సంస్కారానికి విలువలకు ఒకప్పటి చదువ్ఞ పెద్దపీట వేసేది. ఇప్పటి చదువ్ఞలు కేవలం అలంకార ప్రాయాలుగా, ఫ్యాషన్లకు నిలయంగా మారడం వలన విద్యావంతులకు గౌరవం తగ్గిపోయింది. యధాశక్తి తల్లిదండ్రులు కూడా ఇలాంటి పోకడలను ప్రోత్సహించడం తమ పిల్లలను నాగరికత పేరులో విలాసాలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. పల్లెటూర్లలో హాయిగా పనిచేసుకునేవారిని, నాగరికత పేరుతో నగరాలకు వలస పంపిస్తూ తమ పిల్లలు సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారని నలుగురిలో గొప్పలు చెప్పుకోవడం పరిపాటిగా మారింది.

ఇలాంటి ధోరణుల వలనే పల్లె యువత నగరాలకు పయనమై దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా నెట్టుకొస్తున్నది. కొంతమంది విదేశాల్లో అడ్డమైన చాకిరీ చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. ఇక్కడ వంట చేయడం, అంట్లు తోమడం అప్రతిష్టగా భావిస్తున్న వారంతా విదేశాల్లో అలాంటి పనులే చేస్తూ లేనిపోని డాంబికాలకు పోవడం విడ్డూరం. గ్రామీణ ప్రాంతాల్లో బతికే ప్రజలను చులకనగా చూసే పద్ధతి మారాలి. నగరాల్లో జీవించే వారంతా ఒకప్పుడు పల్లెటూళ్లలోనే బతికినవారని, వారి తల్లిదండ్రులుకాని, ఇతర పూర్వీకులుగాని పల్లె వాతావరణం నుంచి వచ్చినవారనే స్పృహ కలగాలి.

మహామహులుగా భారత చరిత్రలో సుస్థిరం స్థానం సంపాదించిన వారిలో అత్యధికులు పల్లెల నుంచే తమ ప్రస్థానం కొనసాగించారన్న సంగతి మరువరాదు. యువత ధోరణిలో కూడా మార్పురావాలి. అరకొర జీతాలతో బతికే డాంబికమైన ధోరణులు విడనాడాలి. పెరుగు తున్న దేశజనాభాతో పాటుగా నగరాలు పెరగవ్ఞ. అందరికీ సరిపడా ఉద్యోగాలు నగరాలు కల్పించలేవ్ఞ. అరకొర జీతాలతో ఖర్చులతో చిన్నాభిన్నమవ్ఞతున్న యువత పల్లెల్లో బతికే తల్లి దండ్రులపై ఆధారపడడం, వారి అవసరాలకు తిండిగింజలను సైతం ఇక్కడ నుంచి తామే పంపించడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.

ఇలాంటి దారుణ పరిస్థితుల మధ్య ఇంకా నగరాలవైపు పరుగిడడం మానుకోవాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో యువత కు తగిన హితబోధ చేయాలి. పల్లెల్లో జీవించడనికి నాణ్యమైన అన్ని సదుపాయాలు నెలకొల్పాలి. అన్ని వృత్తులను పునరుద్ధరిం చాలి. ఇతోధిక ప్రోత్సాహకాలు అందించాలి. చదువ్ఞకున్న వారంతా ఇంజినీర్లు, డాక్టర్లుగా మారిపోవాలన్న ధోరణి మారాలి. నాగరికత పేరుతో విలాసాల పేరుతో, తల్లిదండ్రుల ఆస్తులను అమ్మించి, భ్రమల్లో బతికే విద్యావంతుల వైఖరి మారాలి. పచ్చని ప్రకృతితో శోభిల్లుతూ అరమరికలు లేని ఆత్మీయ బంధాలతో తల తూగే అలనాటి పల్లెవాతావరణాన్ని పునరుజ్జీవింప చేయాలి.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/