అయోధ్యలో పర్యటన మూడు గంటలు
మధ్యాహ్నం ఢిల్లీ కి తిరుగు ప్రయాణం
రామ మందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ నేడు అయోధ్య పర్యటన మొత్తం మూడు గంటలు. ఉదయం 9.35 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి బయలుదేరతారు.
10.35కి లక్నో ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10.40కి హెలికాప్టర్లో లక్నో నుంచి బయలుదేరి 11.30కి అయోధ్యకు 11.40 గంటలకు హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రామజన్మభూమికి చేరుకుంటారు.
రామ్లల్లా విరాజ్మాన్కు 10 నిమిషాల పాటు పూజలు చేస్తారు. 12.15కి ఆలయ ఆవరణలో పారిజాత మొక్క నాటుతారు. 12.30కి భూమి పూజ
12.40కి మందిర నిర్మాణానికి శంకుస్థాపన. 12.45కి ప్రధాని ప్రసంగం. 1.10కి రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులతో భేటీ.2.05 గంటలకి తిరుగు ప్రయాణం.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/