హైదరాబాద్లో ఉన్న భద్రత దేశంలో ఎక్కడా లేదు
మహిళల కోసం తెలంగాణ పోలీసులు చేస్తున్నా కార్యక్రమాలు గ్రేట్
హైదరాబాద్: మహిళల కోసం తెలంగాణ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు నిజంగా గ్రేట్ అని సినీ నటి సాయిపల్లవి అన్నారు. ఇవాళ నగరంలోని హైటెక్ సిటీ హెచ్ఐసీసీలో షీ ఎంపవర్ ఉమెన్స్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి సాయిపల్లవి, సైబరాబాద్ సీపీ సజ్జనార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ..హైదరాబాద్లో ఉన్న భద్రత ఎక్కడా లేదని పోలీసులపై ప్రశంసలు కురిపించారు. సిటీకి చదువు, ఉద్యోగాల కోసం వచ్చే యువతులు గతంలో చాలా భయపడేవారిని అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. పోలీసులు సహకరించడం మన బాధ్యత అని యువతకు సాయిపల్లవి సూచించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/