శ్రీరాముని కరుణ

ఆధ్యాత్మిక చింతన

Lord Sri Rama
Lord Sri Rama


సకల గుణాభిరాముడు, రామా, శ్రీరామ అనగానే భాధలన్ని ఈడేరు తాయి. నేటికి రామాలయం లేని ఊరు అరుదు. శ్రీరాముడే మనకు ఆదర్శం. ఆయన జీవితం మనకు సందేశం అనేది ప్రతి ఒక్కరూ గమనించవలసింది. శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఎందరినో కరుణించి పుణ్య లోక ప్రాప్తి కలిగించాడు. అహల్యకు శపవిమోచన కలింగించాడు.

శబరికి సైతం స్వర్గలోక ప్రాప్తి కలిగించాడు. అందుకు నిదర్శనం సీతాన్వేషన చేస్తున్నప్పుడు జటాయువును చూడటం రెక్కలు విరిగి ధీన స్థితిలో, కోన ఊపిరితో ఉండటం జరిగింది. ఆ స్థితిలో జటాయు వును చూడగానే పరిస్థితి అర్థ మైంది. శ్రీరాములవారికి, సీతా దేవిని రావణుని చెర నుండి కాపాడటానికి రావణుడితో జటా యువు పోరాడి చేసిన త్యాగం మెచ్చుకుని దుర్కిస్తాడు. శ్రీరాము ని చూడగానే కళ్లు తేలేసింది జటాయువు. రాముడు ఆ పక్షికి దహన సంస్కారాలు చేసి, నా అనుజ్ఞతతో ఉత్తమలోకాలకు వెళ్లమని ఆదేశించాడు.

ఆ విధంగా శ్రీరాముని కరుణ వలన జటాయువుకు పుణ్య లోకం ప్రాప్తించింది. జంతువులలో చాలా అల్పమైన ప్రాణి ఉడుత కూడా వంతెన కట్టే సయంలో తన వంతు బాధ్యతగా సహాయపడిందని అంటారు. లంకా నగరానికి సముద్రం మీద వారధి నిర్మిస్తున్నప్పుడు వానరులు రాళ్లు, రప్పలు తెచ్చి వారిధి నిర్మాణానికి పూనుకున్నారు.

ఎవరికి చేతనైన సహాయం వారు చేస్తున్నారు. ఆ వానరులలో చిన్న, చిన్న వానర ములు కూడా తమ చేతనైన సహాయం చేస్తున్నారు. అప్పుడొక ఉడుత ఇదంతా గమనించి నా వంతు సమాయం చేయాలనే తీర్మానించుకుంద. చిన్న వానరులు చేస్తున్న పని తదేకంగా గమనించి, తన అల్పత్వాన్ని లెక్క చేయకతాను ఇసుకలో దొర్లి తన వంటికి అంటుకుని ఉన్న ఇసుక రేణువులను వారధి కట్టే చోట దులుపుతూ సముద్రంలో వేసింది.

అది పదే పదే అటు ఇటు తిరుగుతూ తన చేతనైన సహాయం చేసింది. ఉడుత చేస్తున్న ఆ పనిని పరిశీలనగా చూసిన శ్రీరాముని మనసు ద్రవించి ఉడుతను చేతిలోకి తీసుకుని దాని వీపుపై ప్రేమగా నిమిరాడని దానికి గుర్తుగా ఉడుత వీపు పై మూడు చారలు నేటికి ఉన్నాయి.

ఆ ఉడుత జాతికి శ్రీరాముని కరుణ కటాక్షం వలన ఉన్నత లోక ప్రాప్తమైంది. రామాయణం ఈ జగతుత ఉన్నంత వరకు, శ్రీరాముని కథను జనులు చదివినంత వరకు మనం వానరులను గుర్తుకు చేసికొనకుండా ఉండలేం. అనామకంగా అడవులలో సంచరించే వానరాలకు శ్రీరా ుని కరుణ కటాక్షం వలన ఈ అదృష్టం కలిగింది. రామ, రావణ యుద్ధంలో మరణించిన వారందరూ సజీవులై శ్రీరాముని కరుణా కటాక్షం వలన జీవించారు.

ఓ జటాయువు, ఓ ఉడుత అని చేసిన త్యాగాలకు పుణ్య లోకం ప్రాప్తించి ఉంటే అన్ని తెలిపిన మానవులకు ఆ శ్రీరాముని నామోచ్చారణతో లోక ప్రాప్తి కలుగు తుందని అవసానదశలోనే కాకుండా ప్రతి నిత్యం శ్రీరామ! జయ రామ! జయ జయ రామ అనే రామ నామం వలన ఆ శ్రీ రాముని కరుణా కటాక్షమునకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని అశిద్దాం.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/