నిలకడగానే ప్రణబ్‌ ఆరోగ్యం..ఆర్మీ ఆసుపత్రి

Pranab Mukherjee

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.ప్రణబ్‌‌కు వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగుతున్నట్లు తాజా హెల్త్ బులిటెన్‌లో వైద్యులు ప్రకటించారు. ప్రణబ్‌ ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూచీలను స్పెషలిస్టుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న ప్రణబ్‌కు శస్త్రచికిత్స చేశారు. చికిత్స తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీనికి తోడు.. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై కొంత ఆందోళన నెలకొంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/