ఈ నెల 30 వరకు కోర్టుల్లో లాక్డౌన్ కోనసాగించాలి.
కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో లాక్డౌన్ కొనసాగించాలి అని స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా.. ఈ నెల 25 న మరోకసారి సమావేశమై లాక్డౌన్పై చర్చించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించింది కాగా ఇప్పటికే తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 11 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/