నలుగురు ఉగ్రవాదుల హతం
పోలీసులు, భద్రతా దళాల కూంబింగ్ ఆపరేషన్
Srinagar: కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పత్రిగ్రాం లో పోలీసులు, భద్రతా దళాల కూంబింగ్ ఆపరేషన్ లో ఉండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు.
దీంతో పోలీసులు, భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారనీ అధికారులు తెలిపారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/health1/