జేసీ సోదరులు అధికారులను బెదిరిస్తున్నారు

kethireddy pedda reddy
kethireddy pedda reddy

అనంతపురం: త్రిశూల్‌ భూముల వ్యవహారంలో న్యాయం జరిగే వరకు పోరడతామని వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్రిశూల్‌ మైనింగ్‌ అధికారులను జేసీ కుటుంబం బెదిరిస్తోందని ఆరోపించారు. జేసీ సోదరులు అక్రమాల కోసం అధికారులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/