ఈ ఏడాది ఐపిఎల్‌ జరుగుతుంది

ఆశాభావం వ్యక్తం చేసిన స్టీవ్‌స్మిత్‌

steve smith
steve smith

సిడ్నీ: కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌లీగ్‌ (ఐపిఎల్‌) ఈ ఏడాది ఏదో ఒక సమయంలో జరుగుతుందని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ వైరస్‌ బారిన పడి విలవిలలాడుతుంది. కాని కొన్ని రోజులకు పరిస్థితులు చక్కబడతాయి. ఆ తరువాత అయిన ఐపిఎల్‌ జరుగుతుందన్న ఆశతో ఉన్నట్లు రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్‌ తెలిపాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/