25 శాతం బస్సు చార్జీలు పెంచిన హమాచల్ ప్రభుత్వం
సిమ్లా: బస్సు చార్జీలను 25 శాతం మేర పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ పరివాహన్ సంస్థ బస్సుల్లో మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణానికి కనీసచార్జీని 5రూపాయల నుంచి ఏడు రూపాయలకు పెంచారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బస్సు చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా వైరస్ సంక్షోభ సమయంలో బస్సు చార్జీలను పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడంపై ప్రయాణికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/