ప్రభుత్వం పూర్తి భాధ్యత వహించాలి.. చిన రాజప్ప
వైద్యులకు సదుపాయాలు కల్పించాలని డిమాండ్
అమరావతి: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని, కరోనా నివారణకు ప్రభుత్వం పూర్తి భాధ్యత వహించాలని టిడిపి నేత చిన రాజప్ప డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైద్యులకు సరైన సదుపాయాలు లేవని, వైద్యులకు ప్రాణహాని ఉందని చెప్పిన నర్సీపట్నంలోని వైద్యుడిని సస్పెండ్ చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కు కరోనా కంటే ఇతర అంశాలపైనే శ్రద్ద ఎక్కువని అన్నారు. వైద్యులకు సదుపాయాలు కల్పించాలని కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/