ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బాకీలు ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలి

anitha vangalapudi
anitha vangalapudi

అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బాకీలు ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలని టిడిపి నాయకురాలు అనిత ప్రశ్నించారు. టిడిపి హయంలోని పథకాన్నే జగనన్న వసతి దీవెనగా పేరు మార్చారని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ నందిగం సురేష్‌ నోటిని అదుపులో పెట్టుకోవాలని అనిత హెచ్చరించారు. మహిళలను దుర్భాషలాడి..తిరిగి వారిపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఆడవారిపై ప్రతాపం చూపిస్తున్నారని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను చూసి ప్రజల నవ్వుకుంటునారన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/