పాక్ లో బస్సు ప్రమాదం: 13 మంది మృతి
25 మందికి తీవ్ర గాయాలు : పరిస్థితి ఆందోళనకరం
Islamabad: పాకిస్థాన్లో ఇవాళ ఉదయం బస్సు ప్రమాదం లో 13 మంది మృతిచెందారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన హసన్ అబ్దుల్ బుర్హాన్ ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని హసన్ అబ్దుల్ లోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా వైద్యులు తెలిపారు. మృతుల్లో మహిళ, చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/